NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్ 
    తదుపరి వార్తా కథనం
    త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్ 
    భారతీయ తొలి ఐఫోన్ తయారీదారుగా అవతరించనున్న టాటా గ్రూప్

    త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్ 

    వ్రాసిన వారు Stalin
    Jul 11, 2023
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ తొలి ఐఫోన్ తయారీ సంస్థగా అవతరించేందుకు టాటా గ్రూప్ అడుగు దూరంలోనే ఉంది.

    తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం విస్ట్రాన్ ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ కొంతకాలంగా చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

    రెండు సంస్థల మధ్య ఒప్పందం ఆగస్టులో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం పూర్తయితే ఐఫోన్‌లను తయారు చేసే మొదటి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ ఆవిర్భవించనుంది.

    విస్ట్రాన్‌ను టాటా గ్రూప్ కొనుగోలు చేయడం అనేది భారతదేశ ఆకాంక్షలకు ఇది ఒక ప్రధాన ప్రోత్సాహం అని చెప్పాలి.

    ఐఫోన్‌లను తయారు చేసే భారతీయ కంపెనీ ఉండటం వల్ల, ఇతర ప్రధాన కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడనుంది.

    టాటా

    బెంగళూరు శివార్లలో విస్ట్రోన్ ప్లాంట్

    విస్ట్రోన్‌కు సంబంధించిన ఐఫోన్ ఫ్యాక్టరీ కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉంది.

    ఫ్యాక్టరీ విలువ 600 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఈ డీల్ కోసం టాటా, విస్ట్రాన్ సుమారు ఒక సంవత్సరం కాలంగా చర్చలు జపుతున్నాయి.

    ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. విస్ట్రోన్‌ ప్లాంట్‌ను కొనుగోలు తర్వాత ఆర్థిక సంవత్సరంలో కనీసం 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను రవాణా చేయాలన్న విస్ట్రాన్ తాము పూర్తిచేస్తామని టాటా గ్రూప్ చెబుతోంది.

    ప్రస్తుతం విస్ట్రోన్‌ సంస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సంస్థ లాభాలను గడించేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టింది.

    టాటా

    2017 నుంచి భారతదేశంలో ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్న విస్ట్రాన్ 

    ఐఫోన్‌ల తయారీ వ్యాపారంలోకి రావడం టాటా గ్రూప్‌కి సువర్ణావకాశమని చెప్పాలి. ప్రస్తుతం టాటా గ్రూప్ ఉత్పత్తి చేయని కొన్నింటిలో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ విభాగంలోకి కూడా టాటా గ్రూప్ అడుగుపెడుతోంది.

    ఐఫోన్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి టాటా గ్రూప్ ప్రవేశించడం అనేది మంచి పరిణామంగా భావించాలి. టాటా ఇప్పటికే ఐఫోన్ ఛాసిస్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

    విస్ట్రాన్ 2017లో భారతదేశంలో ఐఫోన్‌లను తయారు చేయడం ప్రారంభించింది. జూన్ 30న ముగిసిన మొదటి త్రైమాసికంలో విస్ట్రాన్ సంస్థ భారతదేశం నుంచి దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐఫోన్
    టాటా
    భారతదేశం
    బెంగళూరు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఐఫోన్

    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్ టెక్నాలజీ
    ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్ ఆపిల్
    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా? టెక్నాలజీ

    టాటా

    ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే! టెక్నాలజీ
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ ఆటో మొబైల్
    టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం ఆటో ఎక్స్‌పో

    భారతదేశం

    భారత గూఢాచారి విభాగం 'రా' అధిపతిగా రవి సిన్హా నియామకం భారతదేశం
    దేశవ్యాప్తంగా వడగాలులతో పెరుగుతున్న మరణాలు; కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సమావేశం  మన్‌సుఖ్ మాండవీయ
    బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు  బైజూస్‌
    భారీగా కరుగుతున్న హిమనీనదాలు.. దిగువన పొంచి ఉన్న పెను ముప్పు హిమాలయాలు

    బెంగళూరు

    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ
    HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు యుద్ధ విమానాలు
    భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు ట్విట్టర్
    శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025