Savitri Jindal: 2023లో ముకేష్ అంబానీ కంటే రెట్టింపు సంపాదించిన మహిళ ఎవరో తెలుసా?
దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ చైర్మన్ ముకేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. అయితే ఈ ఏడాది ఓ మహిళ భారత అపర కుబేరుడు ముకేష్ అంబానీ తనకంటే రెండింతలు ఎక్కువ సంపాదించిన మీకు తెలుసా? ఆమె ఎవరో కాదు.. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్ పర్సన్ సావిత్రి జిందాల్. ప్రస్తుతం ఆమె దేశంలో అత్యంత సంపన్న మహిళగా ఉన్నారు. ఈ సంవత్సరం ఆమె నికర సంపద 9.6 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆమె మొత్తం ఆస్తులు విలువ 25.3మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫలితంగా దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఐదో స్థానానికి సావిత్రి జిందాల్ చేరుకున్నారు.
ఏడాది అంబానీ ఎంత సంపాదించారంటే?
బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ నికర విలువ ఈ సంవత్సరం సుమారు 5 బిలియన్ డాలర్లు పెరిగింది. 92.3 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. OP జిందాల్ గ్రూప్, JSW స్టీల్, జిందాల్ స్టీల్ & పవర్, JSW ఎనర్జీ, జిందాల్ సా, జిందాల్ స్టెయిన్లెస్, పెట్టుబడి సంస్థ JSW హోల్డింగ్స్ వంటి లిస్టెడ్ కంపెనీలు 73 ఏళ్ల సావిత్రి జిందాల్ నేతృత్వంలో నడుస్తున్నాయి. OP జిందాల్ గ్రూప్ను 1952లో సావిత్రి జిందాల్ భర్త ఓపీ జిందాల్ స్థాపించారు. ఓపీ జిందాల్ 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత సావిత్రి జిందాల్ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ వ్యవహరిస్తున్నారు.