
ZestMoney కంపెనీ మూసివేత.. 150 మంది ఉద్యోగుల తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
బీఎన్పీఎల్ స్టార్టప్ 'జెస్ట్మనీ(ZestMoney)'ని మూసివేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
కంపెనీ మూసివేత విషయాన్ని డిసెంబర్ 5న ఉద్యోగులకు యాజమాన్యం తెలియజేసింది.
కంపెనీ మూసివేయడం వల్ల 150 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించనుంది.
కంపెనీ ఉద్యోగులకు రెండు నెలల జీతంతో ఇతర బెన్ ఫిట్స్ అందజేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.
ZestMoney వ్యవస్థాపకులు కంపెనీ నుంచి వైదొలిగిన కొన్ని నెలల తర్వాత మూసివేస్తున్నట్లు ప్రకటన రావడం గమనార్హం.
కొత్త మేనేజ్మెంట్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి.
తొలుత జెస్ట్మనీని ఫోన్ పే కొనుగోలు చేయాలని అనుకుంది. కొనుగోలు ప్రతిపాదనను ఫేన్ పే విరమించుకోవడంతో జెస్ట్మనీ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డిసెంబర్ 5న ఉద్యోగులకు తెలియజేసిన యాజమాన్యం
🚨 BNPL startup @ZestMoney will be shutting down operations and will let go of the remaining 150 employees, the management informed employees in a townhall meeting. The move comes amid regulatory uncertainty and a failed attempt to revive its business under a new management. pic.twitter.com/6ZHBVfYgTp
— Young Turks (@CNBCYoungTurks) December 6, 2023