LOADING...
Tollywood:  క్రిస్మస్ స్పెషల్.. ఈ రోజు రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే!
క్రిస్మస్ స్పెషల్.. ఈ రోజు రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే!

Tollywood:  క్రిస్మస్ స్పెషల్.. ఈ రోజు రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

2025 క్రిస్మస్ పండుగకు తెలుగు సినిమా థియేటర్లు కళకళలాడనున్నాయి. హాలిడే సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ఏకంగా ఆరు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగు చిత్రాలైన ఛాంపియన్, శంభాల, పతంగ్, దండోరా, ఈషా తో పాటు మోహన్‌ లాల్ ప్రధాన పాత్రలో నటించిన వృషభ కూడా నేడు థియేటర్లలో విడుదలవుతోంది. ఈ భారీ లైనప్‌తో క్రిస్మస్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది.

వివరాలు 

ఛాంపియన్

ఈ క్రిస్మస్ రిలీజ్‌లలో అత్యధిక అంచనాలు నెలకొన్న సినిమా రోషన్ హీరోగా నటించిన 'ఛాంపియన్'. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి 169 నిమిషాల రన్‌టైమ్ ఉండగా, U/A సర్టిఫికెట్ లభించింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ విన్నర్‌గా నిలుస్తుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరికొద్ది నిమిషాల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెడుతోంది.

వివరాలు 

శంభాల,దండోరా

ఇక ఆది సాయికుమార్ నటించిన 'శంభాల' కూడా క్రిస్మస్ రేసులో కీలకంగా మారింది. ఈ సినిమాకు A సర్టిఫికెట్ లభించగా, రన్‌టైమ్ 144 నిమిషాలుగా ఉంది. ఇంటెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రంపై ముఖ్యంగా యువ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. విడుదలకు ముందే టీమ్ చేసిన భారీ ప్రమోషన్లతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ సినిమా కూడా నేడు థియేటర్లలో విడుదలవుతోంది. శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన 'దండోరా' కూడా క్రిస్మస్ బరిలో ఉంది. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చిన కథతో తెరకెక్కిన ఈ చిత్రం సామాజిక అంశాలను స్పృశిస్తుందని ప్రచారం జరుగుతోంది. విభిన్నమైన నేరేషన్, ఆసక్తికరమైన తారాగణంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

Advertisement

వివరాలు 

ఈషా,వృషభ

దండోరా మూవీ ఇప్ప‌టికే ప్ర‌ద‌ర్శితం కాగా, టాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన హెబా పటేల్ నటించిన 'ఈషా' మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భయంతో పాటు వినోదాన్ని మేళవించిన కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ మూవీకి ప్రీమియర్లు నిర్వహించినట్టు తెలుస్తుండగా,మరికొద్ది నిమిషాల్లో థియేటర్లలో విడుదల కానుంది. హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన 'వృషభ' తెలుగు వెర్షన్ కూడా క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాపై మోహన్‌లాల్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

వివరాలు 

పతంగ్

అలాగే 'పతంగ్' సినిమా కూడా ఇదే రోజు విడుదలై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొత్తంగా చూస్తే, 2025 క్రిస్మస్‌కు విడుదలవుతున్న సినిమాల్లో రోషన్ నటించిన 'ఛాంపియన్', ఆది సాయికుమార్ 'శంభాల' చిత్రాలపై ఎక్కువ హైప్ కనిపిస్తోంది. విభిన్న జానర్లలో రూపొందిన ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు థియేటర్లకు రప్పిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. చివరికి ఈ క్రిస్మస్ బాక్సాఫీస్ విన్నర్ ఏ సినిమా అవుతుందో చూడాల్సిందే.

Advertisement