
Allu Arjun : పుష్ప 2 నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో ఘన విజయం సాధించిన "పుష్ప" సినిమాకు సీక్వెల్గా రాబోతున్న "పుష్ప 2"పై భారీ అంచనాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ అభిమానులు, అలాగే సినీ ప్రేమికులు ఈ చిత్రాన్ని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దాదాపు మూడేళ్లుగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు మెరుగులు దిద్దుతున్నాడు.
ఈ ఏడాది ఆగస్టులో విడుదల కావాల్సిన ఈ సినిమా, షూటింగ్ వాయిదా కారణంగా డిసెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటీవల,ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.డిసెంబరు 6న విడుదల కానున్న ఈ సినిమాకు కౌంట్డౌన్ మొదలవుతూ, ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు.
వివరాలు
శరవేగంగా షూటింగ్ చేస్తున్న పుష్ప రాజ్
"కేవలం 75 రోజులు మాత్రమే పుష్ప రాజ్ రూలింగ్ను చూడబోతున్నారు" అంటూ ఈ పోస్టర్ను అభిమానుల కోరిక మేరకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా కొనసాగుతోంది.
ఈ సినిమాలో "జాతర పాట" ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ ధీమాగా ఉంది. అక్టోబర్ చివరి నాటికి మొత్తం షూటింగ్ను పూర్తి చేసేందుకు సుకుమార్ లాంగ్ షెడ్యూల్లో పనులు వేగవంతం చేస్తున్నాడు.
"పుష్ప - 2"లో రష్మిక మందాన కథానాయికగా నటిస్తుండగా, ఈ సీక్వెల్లో వచ్చే ఐటం సాంగ్లో నటించే హీరోయిన్ ఎవరో త్వరలో క్లారిటీ రానుంది.
మైత్రి మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
75 DAYS for the world to witness Pushpa and his matchless aura on the big screens ❤🔥#Pushpa2TheRule will mark an unprecedented chapter in Indian Cinema 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) September 23, 2024
THE RULE IN CINEMAS on 6th DEC 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP… pic.twitter.com/nMt3X5rKM7