AHA OTT : OTT లోకి వచ్చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
సుహాస్ హీరోగా యువ దర్శకుడు దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, ఎంటర్టైనర్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇప్పుడు,ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ ఆహాలో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.నేడు అర్ధరాత్రి నుండి ఈ మూవీ ఎర్లీ స్ట్రీమింగ్ యాక్సెస్ ని ఆహా వారు గోల్డ్ యూజర్స్ కి అందిస్తున్నారు.రేపటి నుండి ఆహా నార్మల్ యూజర్స్ కి ఈ మూవీ అందుబాటులోకి రానుంది. శివాని నగరం,గోపరాజు రమణ,జగదీష్ ప్రతాప్ బండారి,స్వర్ణకాంత్ కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ మూవీని ధీరజ్ మొగిలినేని నిర్మించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు.