Loading...
Rakul preet singh: టాలీవుడ్‌లో కనిపించే ఐక్యత బాలీవుడ్‌లో లేదు: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్‌లో కనిపించే ఐక్యత బాలీవుడ్‌లో లేదు: రకుల్ ప్రీత్ సింగ్

Rakul preet singh: టాలీవుడ్‌లో కనిపించే ఐక్యత బాలీవుడ్‌లో లేదు: రకుల్ ప్రీత్ సింగ్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 18, 2026
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు చిత్రసీమ తన సినీ ప్రయాణానికి బలమైన పునాది వేసిందని ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్‌లో నటీనటుల మధ్య ఐక్యత, పరస్పర ప్రోత్సాహం, సహకార భావం ఎక్కువగా కనిపిస్తుందని ఆమె అభిప్రాయపడింది. తెలుగులో వరుస విజయాలతో ప్రేక్షకులకు చేరువైన రకుల్ ప్రస్తుతం ప్రధానంగా హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్ చిత్రపరిశ్రమల మధ్య ఉన్న వాతావరణంపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించింది.

వివరాలు

బాలీవుడ్‌లో అలాంటి వాతావరణం ఉండదు..

"టాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు ఒకరి సినిమాలకు మరొకరు బహిరంగంగా ప్రచారం చేస్తూ మద్దతు తెలుపుతుంటారు.

పోటీ ఉన్నప్పటికీ దానిని పక్కనపెట్టి, సహచరుల విజయాలను హృదయపూర్వకంగా అభినందిస్తారు.

కానీ బాలీవుడ్‌లో అలాంటి వాతావరణం అంతగా కనిపించదు. అక్కడ అభద్రతా భావం ఎక్కువగా ఉండటంతో ఒకరికి ఒకరు అండగా నిలవడానికి వెనుకాడుతుంటారు.

ముంబయి చిత్రసీమలో ప్రతికూల ప్రచారం కూడా సాధారణంగా మారిపోయింది.

అలాంటి ధోరణికి ముగింపు పలికితే బాలీవుడ్ మళ్లీ బలమైన స్థితికి చేరుకుంటుంది.

అందరూ కలిసి పనిచేస్తూ, పరస్పరం ప్రోత్సహించుకుంటేనే ఆ పరిశ్రమ మరింత శక్తివంతంగా ఎదుగుతుంది" అని రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది.

ADVERTISEMENT