Loading...
Prabhas Fauji: ప్రభాస్ కోసం గచ్చిబౌలిలో మరో చార్మినార్.. 'ఫౌజీ' కోసం భారీ సెట్ సిద్ధం!
ప్రభాస్ కోసం గచ్చిబౌలిలో మరో చార్మినార్.. 'ఫౌజీ' కోసం భారీ సెట్ సిద్ధం!

Prabhas Fauji: ప్రభాస్ కోసం గచ్చిబౌలిలో మరో చార్మినార్.. 'ఫౌజీ' కోసం భారీ సెట్ సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా అప్‌డేట్ అభిమానులకు పండుగలాంటిదే. తాజాగా ఆయన నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చార్మినార్ అంటే హైదరాబాద్ పాతబస్తీ గుర్తుకు వస్తుంది. అయితే త్వరలో గచ్చిబౌలిలో కూడా మరో 'చార్మినార్' కనిపించనుంది. అయితే అది చారిత్రక కట్టడం కాదు.. 'ఫౌజీ' సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న భారీ సినిమా సెట్. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కీలక దశలో ఉంది.

వివరాలు

షెడ్యూల్ ప్రకారమే సినిమా ప్రేక్షకుల ముందుకు

తదుపరి షూటింగ్ షెడ్యూల్ కోసం గచ్చిబౌలి-లింగంపల్లి రోడ్డులోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో అసలు చార్మినార్‌ను తలపించేలా భారీ సెట్‌ను చిత్ర బృందం నిర్మిస్తోంది.

ఈ సెట్‌లోనే సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమైన 25 రోజుల షూటింగ్ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారు.

ఈ షెడ్యూల్ పూర్తయ్యే సమయానికి సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తవుతుందని సమాచారం.

అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళిక సిద్ధం చేశారు.

వివరాలు

అసలు చార్మినార్ వద్ద కాకుండా సెట్ ఎందుకు?

చార్మినార్ వద్ద నేరుగా షూటింగ్ నిర్వహించకుండా ప్రత్యేక సెట్ నిర్మించడానికి కూడా బలమైన కారణమే ఉందని తెలుస్తోంది.

ప్రభాస్‌కు ఉన్న అపారమైన అభిమాన గణం కారణంగా పాతబస్తీలో షూటింగ్ నిర్వహిస్తే వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది.

దాంతో ట్రాఫిక్ సమస్యలు, భద్రతా ఇబ్బందులు, షూటింగ్‌కు అంతరాయం కలిగే ప్రమాదం ఉండటంతో, అదే వాతావరణాన్ని గచ్చిబౌలిలో భారీ సెట్ రూపంలో సృష్టించాలని చిత్ర బృందం నిర్ణయించింది.

దీంతో షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగనుంది.

ADVERTISEMENT

వివరాలు

విడుదలపై పుకార్లకు చెక్

ఇదిలా ఉండగా 'ఫౌజీ' విడుదల వాయిదా పడుతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ పుకార్లకు నిర్మాత రవిశంకర్ అధికారికంగా చెక్ పెట్టారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని, 2026 డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల్లో మరోసారి ఉత్సాహం నెలకొంది.

ADVERTISEMENT