Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి యూఏఈ గోల్డెన్ వీసా
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవికి యూఏఈ నుంచి మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కల్చర్ & టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది.
ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థ ఈ గోల్డెన్ వీసా ఇచ్చినట్టు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు పలువురికి ఇచ్చారు.
బాలీవుడ్ సహా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలకు ఇదే రకమైన వీసా మంజూరు అయింది.
తలైవా రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సానియా మీర్జా, సల్మాన్ ఖాన్, జాహ్నవి కపూర్, రణవీర్ సింగ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్ వంటి వారికి కూడా UAE ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది.
Details
UAE ఎవరికి గోల్డెన్ వీసా ఇస్తుంది?
యూఏఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించే లక్ష్యంతో అనేక పథకాలను ప్రారంభించింది.
ఈ పథకాలలో గోల్డెన్ వీసా ఒకటి.ఈజీగా అర్ధం అయ్యేలా చెప్పాలంటే,గోల్డెన్ వీసా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, వైద్య నిపుణులు, సైన్స్ జ్ఞానంతో అనుబందం వున్న వారికి ఇస్తారు.
వీరిలో కళాకారులు UAEలో ఎక్కువ కాలం స్థిరపడటానికి ,అక్కడ ఉండడానికి అనుమతిస్తుంది. ఈ వీసా పథకం 2019 సంవత్సరంలోఅమలులోకి తెచ్చారు.
ఈ వీసా 5 నుండి 10 సంవత్సరాల వరకు జారీ చేస్తారు. ఇందులో వీసా హోల్డర్కు ప్రత్యేకాధికారాలు ఇస్తారు.
ఈ వీసా ప్రధానంగా వైద్యులు, శాస్త్రవేత్తలు, సంస్కృతి కళాకారులు, క్రీడాకారులు, డాక్టరల్ డిగ్రీ హోల్డర్లకు ఇస్తారు. ఈ వీసాలో వీసా హోల్డర్కు దీర్ఘకాలిక నివాసం అనుమతిస్తారు.