Page Loader
Vishwambhara: విశ్వంభర మ్యూజికల్ సెషన్ నుండి ఫోటో వైరల్ 
విశ్వంభర మ్యూజికల్ సెషన్ నుండి ఫోటో వైరల్

Vishwambhara: విశ్వంభర మ్యూజికల్ సెషన్ నుండి ఫోటో వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 21, 2024
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విశ్వంభర'. పాన్ ఇండియా స్థాయిలో వ‌స్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏళ్ల త‌ర్వాత చిరంజీవితో క‌లిసి న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో చిరంజీవి, ఎంఎం కీరవాణిల‌తో త్రిష ఫొటో దిగారు. దానిని ట్వీట్ చేసిన ఆమె 'లెజెండ‌రీల‌తో దివ్య‌మైన ఉద‌యం' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇటీవల, బృందం చిరంజీవిపై ఒక పాటను రూపొందించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇషా చావ్లా, సురభి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హీరోయిన్ త్రిష చేసిన ట్వీట్