Loading...
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో దర్శకుడి ఆనందం.. ఇప్పుడు విరాట్‌, అనుష్కలకు స్పెషల్‌ రిక్వెస్ట్‌!
సెహ్వాగ్ ప్రశంసలతో దర్శకుడి ఆనందం.. ఇప్పుడు విరాట్‌, అనుష్కలకు స్పెషల్‌ రిక్వెస్ట్‌!

Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో దర్శకుడి ఆనందం.. ఇప్పుడు విరాట్‌, అనుష్కలకు స్పెషల్‌ రిక్వెస్ట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 04, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక సినిమా విజయవంతం కావాలంటే భారీ బడ్జెట్‌, స్టార్‌ హీరో, కోట్ల రూపాయల ప్రమోషన్‌ అవసరం లేదని 'హనుమాన్ అంశ్' మరోసారి నిరూపిస్తోంది. ఎలాంటి భారీ మార్కెటింగ్‌ హంగామా లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ ఆధ్యాత్మిక చిత్రం తొలిరోజు కేవలం రూ.10 లక్షల వసూళ్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్‌ మౌత్‌టాక్‌ సినిమాకు ఊహించని స్థాయిలో కలిసొచ్చింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు క్రమంగా ఆదరణ పెరిగింది. థియేటర్ల సంఖ్య పెరగడం, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో 'హనుమాన్ అంశ్' బాక్సాఫీస్‌ వద్ద అనూహ్యంగా దూసుకెళ్లింది.

వివరాలు

నీమ్‌ కరోలి బాబా జీవితంపై..

ఇప్పుడు ఈ సినిమాకు క్రికెట్‌ ప్రపంచం నుంచి కూడా ప్రశంసలు రావడం మరింత ప్రత్యేకంగా మారింది.

మాజీ భారత క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ సినిమాను చూసి స్పందించడంతో దర్శకుడు విశాల్‌ చతుర్వేది భావోద్వేగానికి గురయ్యారు.

అంతేకాదు.. స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్క శర్మ కూడా ఈ సినిమాను చూడాలని విశాల్‌ చతుర్వేది విజ్ఞప్తి చేశారు.

నీమ్‌ కరోలి బాబా జీవితం నుంచి స్ఫూర్తి పొంది విశాల్‌ చతుర్వేది రచించి, దర్శకత్వం వహించిన చిత్రమే 'హనుమాన్ అంశ్'. భక్తులు ప్రేమగా 'మహారాజ్‌ జీ' అని పిలుచుకునే నీమ్‌ కరోలి బాబా బోధనలు, ఆయన జీవితంలోని ఆధ్యాత్మిక కోణాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.

వివరాలు

మూడో వారంలో పెరిగిన వసూళ్లు

శోభినవ్‌ సత్యా, విహాన్‌ షెడ్గే, చందన్‌ ఆనంద్‌, పూర్ణిమ తివారీ, అనిల్‌ రస్తోగి, గుల్షన్‌ పాండే తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.

ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదట్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. తొలి రోజున దాదాపు రూ.10 లక్షల వసూళ్లతోనే సరిపెట్టుకుంది.

మొదటి వారం పూర్తయ్యే నాటికి కూడా కలెక్షన్లు దాదాపు రూ.1.08 కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. రెండో వారంలోనూ వసూళ్లలో పెద్దగా మార్పు కనిపించలేదు.

అయితే మూడో వారం నుంచి 'హనుమాన్ అంశ్' పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ADVERTISEMENT

వివరాలు

మూడో వారం నుంచి ఒక్కసారిగా మారిన పరిస్థితి..

సినిమాను చూసిన ప్రేక్షకులు ఇచ్చిన మౌత్‌టాక్‌ ప్రధాన బలంగా మారడంతో కలెక్షన్లు క్రమంగా పుంజుకున్నాయి.

సినిమా గురించి మరింత మంది ప్రేక్షకులకు తెలియడంతో థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ ప్రభావంతో బాక్సాఫీస్‌ వసూళ్లు ఊహించని స్థాయిలో పెరిగాయి.

సెప్టెంబర్‌ 3 నాటికి ఈ సినిమా భారత్‌లో రూ.61 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లు సాధించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

కేవలం రూ.2కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్‌ను కూడా దాటే దిశగా దూసుకెళ్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

భారీ బడ్జెట్‌, స్టార్‌ హీరో, భారీ ప్రమోషన్లు లేకుండానే కేవలం కంటెంట్‌, ప్రేక్షకుల మౌత్‌టాక్‌తో ఓ సినిమా ఎంతటి విజయాన్ని అందుకోగలదో 'హనుమాన్ అంశ్' సక్సెస్‌ మరోసారి చాటిచెబుతోంది.

ADVERTISEMENT