LOADING...
Puri Jagannadh: 15 ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్ కాంబో రిపీట్ చేస్తున్న దర్శకుడు పూరి
15 ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్ కాంబో రిపీట్ చేస్తున్న దర్శకుడు పూరి

Puri Jagannadh: 15 ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్ కాంబో రిపీట్ చేస్తున్న దర్శకుడు పూరి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలందరికీ ఒక దశలో కమ్‌బ్యాక్ ఇచ్చిన ఆయనతో, అప్పట్లో అగ్ర హీరోలు సినిమా చేయాలని ఆసక్తి చూపేవారు. అయితే ప్రస్తుతం ఆయనకు అనుకూలంగా కాలం నడవడం లేదు. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' వంటి రెండు భారీ పాన్‌ ఇండియా డిజాస్టర్లు ఎదుర్కొన్న అనంతరం, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. తాజా సమాచారం మేరకు, పూరీ తన కొత్త చిత్రానికి సంబంధించి ఆసక్తికర చర్చలు జరుపుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా టాలెంటెడ్ హీరో గోపీచంద్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Details

అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

ఈ చిత్రానికి పూరీ కేవలం స్టోరీ, డైలాగ్స్ అందిస్తారని, కానీ స్క్రీన్‌ప్లే విషయంలో తన పాత స్టైల్‌ను కొనసాగిస్తారని టాక్. గతంలో వీరిద్దరి కలయికలో 2010లో వచ్చిన 'గోలీమార్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు, 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ కానుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 'సీటీమార్', 'రామబాణం' వంటి సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో, కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాస్ చుట్టూరి నిర్మాణంలో ఓ సినిమా ఖరారైనట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదనంగా, మరో రెండు ప్రాజెక్టులకు కూడా గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.