
Naresh : కామెడీ హీరో నుంచి విలన్ అవతారం.. పాన్ ఇండియా మూవీలో విలన్గా నరేష్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటుడు నరేష్. 'ప్రేమ సంకెళ్ళు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, 'నాలుగు స్తంభాలాట' వంటి విజయవంతమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కామెడీ ప్రధాన చిత్రాల్లో ఎక్కువగా నటించి, తన ప్రత్యేకమైన హాస్య టైమింగ్తో ప్రేక్షకులను అలరించారు. అయితే ఆయన నటన కేవలం కామెడీ రోల్స్కే పరిమితం కాలేదు. సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ జానర్లలోనూ సమానంగా రాణించి, ఆల్రౌండర్ నటుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న నరేష్, తాజాగా నారా రోహిత్, శ్రీదేవి సాహా జంటగా నటించిన 'సుందరకాండ' సినిమాలో కీలక పాత్ర పోషించారు.
Details
ఎమోషనల్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం
ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. "నాకు కామెడీ నటుడిగా మంచి గుర్తింపు ఉంది. రంగస్థలం తరువాత ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా నాకిష్టమని, నేను చేయగలనని అందరూ గుర్తించారు. నేను ఎప్పుడూ నా పాత్రలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ప్రస్తుతం కొన్ని మంచి ఎమోషనల్ రోల్స్ చేస్తున్నాను. అంతేకాదు, నాలుగు రసాల్ని పండించే విచిత్రమైన పాత్రలోనూ నటిస్తున్నాను. ఇవన్నింటికంటే ముఖ్యంగా, ఒక పాన్ ఇండియా సినిమాలో విలన్గా నటించబోతున్నానని నరేష్ వెల్లడించారు.
Details
త్వరలోనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
అయితే ఆ సినిమా హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? అనే వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఇప్పుడే చెప్పలేను కానీ ఆ సినిమా చాలా పెద్ద రేంజ్లో రూపొందుతుంది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలుస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం నరేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. వెటరన్ నటుడు ఒక పాన్ ఇండియా మూవీలో విలన్గా కనిపించబోతున్నాడన్న వార్తపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.