
Raja Saab: ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్.. జూలైలో 'రాజా సాబ్' ఫైనల్ షెడ్యూల్!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల 'కన్నప్ప' చిత్రంలో రుద్ర పాత్రలో చిన్న హంగామా చేసినప్పటికీ, ప్రేక్షకులలో భారీగా హైప్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'రాజా సాబ్'పై ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా, ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ప్రభాస్ తన కామెడీ టైమింగ్తో అలరిస్తూనే, అవసరమైన చోట హీరోయిజాన్ని ప్రదర్శిస్తాడని విశ్లేషకుల అభిప్రాయం. ఈ చిత్రం 2025 డిసెంబర్ 5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు భిన్నమైన లుక్స్తో కనిపించనున్నాడు.
Details
కీలక పాత్రలో మళివక మోహనన్, నిధి అగర్వాల్
గ్లింప్స్లో కనిపించిన ఈ షేడ్స్ సినిమాపై అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆయన మ్యూజిక్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజా సాబ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. జూలై మొదటి వారంలో హైదరాబాద్లో నిర్మించిన ప్యాలెస్ సెట్లో క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ జరుగనుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొననున్నారు.
Details
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
అనంతరం మారుతి అండ్ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇక 2026 సమ్మర్కి హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్తో ప్రభాస్ ఉన్నట్లు సమాచారం. వరుస హిట్స్తో జోష్ మీదున్న ప్రభాస్, 'రాజా సాబ్'తో మరో హిట్ ఖాతాలో వేసేలా కనిపిస్తున్నారు.