Guntur Kaaram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. నేడే 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్
మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. అయితే మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గుంటూరు కారం' ట్రైలర్పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు (ఆదివారం) 'గుంటూరు కారం' ట్రైలర్ను విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే సమయం ఎప్పుడు అనేది చెప్పలేదు. కానీ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో ట్రైలర్ను విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. గుంటూరు కారంలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, వెన్నెల కిషోర్, ఇతర నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.