
Akkineni Nagarjuna: 27 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో మళ్లీ జోడీ కట్టనున్న టబు?
ఈ వార్తాకథనం ఏంటి
కుబేర, కూలీ సినిమాలతో మళ్లీ ట్రాక్లోకి వచ్చిన స్టార్ నటుడు అక్కినేని నాగార్జున తన కెరీర్లో 100వ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్కు సంబంధించిన పూజ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అక్కినేని నాగార్జున సరసన ప్రముఖ సీనియర్ నటి టబు నటించబోతున్నారని వార్తలు ఫిల్మ్నగర్లో వైరల్ అయ్యింది. ఇది నిజమైతే, సుమారు 27 ఏళ్ళ తరువాత వీరిద్దరి కలిసి నటించబోతున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
సిసింద్రి సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసిన టబూ
తెలుగులో వీరిద్దరూ కలిసి ఇంతకుముందు నిన్నే పెళ్ళాడతా,ఆవిడా మా ఆవిడే వంటి విజయవంతమైన చిత్రాల్లో జోడీగా నటించారు. అదనంగా, సిసింద్రి సినిమాలో టబు ఒక ప్రత్యేక గీతంలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ, చాలా సంవత్సరాలుగా టాలీవుడ్ నుంచి దూరంగా ఉండి వచ్చిన టబు నాగార్జున 100వ చిత్రంలో భాగమవుతున్నారని తెలిసినప్పటి నుంచి ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వార్తలకు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, ఈ ప్రతిష్టాత్మక సినిమాకు 'ఆకాశం' సినిమా దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారనేది సినీ వర్గాల్లో సమాచారం.