
Sekhar Kammula : తమిళ్లో 'కుబేర' డిజాస్టర్.. కారణం తెలియదన్న డైరక్టర్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'కుబేర' ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తోంది. యూనానిమస్ బ్లాక్బస్టర్ టాక్తో విడుదలైన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ధనుష్ నటనకు విశేషంగా ప్రశంసలు లభించాయి. గతంలో వచ్చిన 'రాయన్' చిత్రంతో పోలిస్తే ఎంతో వేగంగా వంద కోట్ల క్లబ్లో చేరిన 'కుబేర' ధనుష్కు మరో భారీ విజయాన్ని అందించింది. అయితే తన స్వస్థలమైన తమిళనాడులో మాత్రం 'కుబేర'కు నిరాశ కలిగే స్పందన లభించింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, రెండో రోజు నుంచే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.
Details
ఫలితం అంచనాలకు భిన్నంగా వచ్చింది
ధనుష్ నటనపై ప్రశంసలు అందినప్పటికీ, కథ నెమ్మదిగా సాగుతుందని ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ వచ్చింది. మొదటి వారంలో అక్కడ దాదాపు రూ. 20 కోట్లు మాత్రమే గ్రాస్ వసూళ్లను రాబట్టి, తమిళనాడులో చిత్రం ఫ్లాప్గా మారింది. ఈ విషయంపై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కథ ప్రతీ ఒక్కరినీ కనెక్ట్ చేసేలా ఉంది. పైగా ధనుష్ లాంటి స్టార్ నటిస్తున్నాడనే ఉత్సాహంతో తమిళ ప్రేక్షకులకు కథ బాగా కనెక్ట్ అవుతుందని భావించాం. కానీ ఫలితం మాత్రం మా అంచనాలకు భిన్నంగా వచ్చింది. తమిళ్ వెర్షన్ ఫెయిల్యూరును మేం గమనిస్తున్నాం. దీనిపై మరింత లోతుగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అర్థమవుతోందని తెలిపారు.