LOADING...
Mahesh Babu: హ్యపీ బర్త్ డే ఎన్ఎస్జీ.. భార్యకు ప్రేమతో విషెస్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మహేష్ బాబు పోస్ట్
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మహేష్ బాబు పోస్ట్

Mahesh Babu: హ్యపీ బర్త్ డే ఎన్ఎస్జీ.. భార్యకు ప్రేమతో విషెస్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మహేష్ బాబు పోస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. భార్య, పిల్లలంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. షూటింగ్‌ల మధ్య కొద్దిగా సమయం దొరికినా కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోతుంటారు. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య నమ్రతా శిరోద్కర్‌ను మరింత ఆప్యాయంగా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ (జనవరి 22) నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో చేసిన హృద్యమైన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

వివరాలు 

హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్జీ

భార్య నమ్రతా పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు. నమ్రతా ఫొటోను షేర్ చేస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్జీ (నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని). ఎంతో గ్రేస్, ప్రేమతో ప్రతి విషయంలోనూ నా వెంట నిలుస్తున్నందుకు థ్యాంక్యూ. ఇంతకంటే జీవితంలో ఇంకేమి కావాలి" అంటూ మహేష్ బాబు క్యాప్షన్ ఇచ్చారు.

వివరాలు 

వైరల్ అవుతున్న పోస్ట్

నమ్రతాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దంపతుల మధ్య ఉన్న ప్రేమను చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. "వదినమ్మా హ్యాపీ బర్త్ డే" అంటూ మహేష్ బాబు అభిమానులు కామెంట్లతో సోషల్ మీడియాను నింపుతున్నారు.

Advertisement

వివరాలు 

ప్రేమ నుంచి పెళ్లి వరకు

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ 2006 ఫిబ్రవరి 10న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2000లో విడుదలైన 'వంశీ' సినిమాలో హీరో-హీరోయిన్లుగా కలిసి నటించిన సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొదలైంది. దాదాపు అయిదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నమ్రతా మాజీ మిస్ ఇండియా కాగా, పెళ్లి అనంతరం సినిమాలకు దూరమై పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయిస్తున్నారు.

Advertisement

వివరాలు 

వారణాసి షూటింగ్‌లో మహేష్ బాబు

ప్రస్తుతం మహేష్ బాబు 'వారణాసి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. 2027 సమ్మర్‌లో 'వారణాసి' సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే టైటిల్ రిలీజ్, మహేష్ బాబు లుక్ రివీల్ కోసం 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ మూవీ టీజర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

Advertisement