Loading...
Mirzapur Movie collections: ఓటీటీ తర్వాత థియేటర్లలోనూ సత్తా.. రూ.220 కోట్లతో 'మీర్జాపూర్‌' జోరు
ఓటీటీ తర్వాత థియేటర్లలోనూ సత్తా.. రూ.220 కోట్లతో 'మీర్జాపూర్‌' జోరు

Mirzapur Movie collections: ఓటీటీ తర్వాత థియేటర్లలోనూ సత్తా.. రూ.220 కోట్లతో 'మీర్జాపూర్‌' జోరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓటిటిలో విశేష ఆదరణ పొందిన 'మీర్జాపూర్' (Mirzapur) సిరీస్‌.. ఇప్పుడు వెండితెరపైనా అదే జోరును కొనసాగిస్తోంది. అలీ ఫజల్, దివ్యేందు, పంకజ్ త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 'మీర్జాపూర్: ది మూవీ' (Mirzapur The Movie) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దేశీయంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం.. 'మీర్జాపూర్: ది మూవీ' దేశీయంగా రూ.220.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక నెట్ కలెక్షన్లు రూ.184.79 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన తొలి రోజే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి తన సత్తా చాటుకుంది.

వివరాలు

ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది

2018లో స్ట్రీమింగ్ సిరీస్‌గా ప్రారంభమైన 'మీర్జాపూర్'.. ఇప్పటివరకు మూడు సీజన్లను పూర్తి చేసుకుని భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన ఓటీటీ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచింది.

ఇప్పుడు తొలిసారిగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ ఫ్రాంచైజీ.. వెండితెరపైనా అదే స్థాయి విజయాన్ని అందుకుంటోంది.

2018 నేపథ్యంలో సాగే 'మీర్జాపూర్: ది మూవీ'లో.. తొలి సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు చెప్పని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

ఈ సినిమాలో రసిక దుగల్, శ్రియ పిల్‌గావ్కర్, శ్వేతా త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ తమ పాత పాత్రల్లోనే మరోసారి అలరించారు.

వివరాలు

భారీగా కలెక్షన్లు వసూలు

అదే సమయంలో జితేంద్ర కుమార్, రవి కిషన్, సోనాల్ చౌహాన్ కొత్తగా సినిమాలో సందడి చేశారు. ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు.

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా 'మీర్జాపూర్: ది మూవీ'ని నిర్మించాయి.

ఇలా ఓటీటీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'మీర్జాపూర్' ఫ్రాంచైజీ.. తొలిసారి థియేటర్లలోకి వచ్చి కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తోంది.

ADVERTISEMENT