Tagaram Bhil: పేదరికాన్ని జయించిన జానపద కళాకారుడు.. తగారాం భీల్కు పద్మశ్రీ
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ ఎడారి నేల నుంచి వినిపించిన అల్గోజా స్వరాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన జానపద కళాకారుడు తగారాం భీల్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. మే 25న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు. జనవరి 2025లో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దేశ జానపద కళలకు ఇది గర్వకారణంగా భావిస్తున్నారు.
వివరాలు
పేదరికం మధ్య పెరిగిన తగారాం
రాజస్థాన్లోని జైసల్మేర్కు సమీపంలోని మూలసాగర్ గ్రామంలో తగారాం భీల్ జన్మించారు. చిన్నప్పటి నుంచే కుటుంబ ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి. కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో అడవుల్లో మేకలు మేపేవారు. తరువాత కుటుంబ పోషణ కోసం కూలి పనులు కూడా చేశారు. రాళ్లు కొట్టే పని చేస్తూ జీవితాన్ని ముందుకు నడిపించారు. చిన్న వయసులోనే అల్గోజాపై ఆసక్తి తగారాం వయసు ఏడేళ్లే ఉన్నప్పుడు ఆయనకు తండ్రి వాయించే అల్గోజా వాద్యంపై ఆసక్తి పెరిగింది. మేకలు మేపేందుకు అడవికి వెళ్లే సమయంలో దొంగచాటుగా అల్గోజాను వెంట తీసుకెళ్లి గంటల తరబడి సాధన చేసేవారు. ఎడారి నిశ్శబ్దంలో కూర్చొని రోజంతా స్వరాభ్యాసం కొనసాగించేవారు. పట్టుదల,కష్టంతో 15 ఏళ్లకే అల్గోజా వాయిద్యంలో నిపుణుడిగా గుర్తింపు పొందారు.
వివరాలు
దేశం నుంచి విదేశాల వరకు అల్గోజా స్వరం
1981లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జైసల్మేర్లో నిర్వహించిన 'మరు మహోత్సవ్'లో తొలిసారి వేదికపై అల్గోజా ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శన తర్వాత తగారాంకు వెనుదిరిగి చూసే అవసరం రాలేదు. ఆ తర్వాత అమెరికా, జపాన్, ఆఫ్రికా, ఫ్రాన్స్, రష్యా సహా 25కి పైగా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి భారత జానపద సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తగారాం భీల్కు పద్మశ్రీ
Taga Ram Bheel, renowned maestro of the Algoza, will be honoured with the Padma Shri for his exceptional contribution to preserving and promoting the traditional folk music of the Thar Desert.
— PIB - Ministry of Home Affairs (@PIBHomeAffairs) May 17, 2026
Hailing from Jaisalmer, Rajasthan, he has dedicated his life to mastering and… pic.twitter.com/ig9ovlfCxf
వివరాలు
మే 25న పద్మ పురస్కారాల ప్రదానం
మే 25 సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో మొత్తం 131 మందికి పద్మ పురస్కారాలు అందజేయనున్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం 'పీపుల్స్ పద్మ' భావనకు ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిస్వార్థంగా కళలు, సమాజ సేవకు కృషి చేస్తున్న ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడమే దీని లక్ష్యంగా చెబుతున్నారు. #PeoplesPadma కింద ఎవరైనా నామినేషన్లు పంపే అవకాశం ఉంది.