వాలెంటైన్స్ డే రోజున వైరల్ అవుతున్న సాయి ధరమ్ తేజ్ లవ్ మెసేజ్
ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు. ఈరోజు అందరూ తమ సోషల్ మీడియాలో ప్రేమ గురించి సందేశాలు పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. హౌ టు ఫాల్ ఇన్ లవ్ అనే పుస్తకాన్ని చదువుతున్నట్టుగా రెండు ఫోటోలు పెట్టాడు సాయి ధరమ్ తేజ్. ఒక ఫోటోలో బుక్ చదువుతూ కనిపిస్తే మరో ఫోటోలో పుస్తకాన్ని మర్చిపోయి నిద్రపోతున్నట్టు కనిపించాడు. ఈ రెండు ఫోటోలు పెట్టిన సాయి ధరమ్ తేజ్, తాను ఈ పుస్తకాన్ని కేవలం నిద్రపోవడానికి మాత్రమే చదువుతానని అన్నాడు. ఇంకా అంతటితో ఆగకుండా, ప్రేమికుల రోజున తనకు అర్థమైన విషయాన్ని చెబుతూ, ప్రతీ ఒక్కరూ ప్రేమించాలని, తమపట్ల తాము ప్రేమగా ఉండాలని అన్నాడు.
నువ్వెలా ఉన్నా నిన్ను నువ్వు ప్రేమించాలంటున్న సాయి ధరమ్ తేజ్
సెల్ఫ్ లవ్ గొప్పదనీ, దానివల్ల కొత్త ఉత్సాహం వస్తుందని, నువ్వెలా ఉన్నా, మంచివాడివైనా చెడ్డవాడివైనా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని సెల్ఫ్ లవ్ గురించి చెబుతూ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. అదలా ఉంచితే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష మూవీ చేస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీ కన్నడ, మళయాలం భాషల్లో రూపొందుతోంది. ఆల్రెడీ రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ చేసిన సినిమా ఇదే. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో రూపొందుతుంది. 2023 ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ అవుతుందని ప్రకటించారు.