తారకరత్న అంత్యక్రియల్లో అజ్ఞాతవ్యక్తి: బాలకృష్ణతో మాట్లాడుతుంటే పక్కకు తీసుకెళ్ళిన పోలీసులు
20రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న, చివరగా మహాశివరాత్రి రోజున శివైక్యం అయ్యారు. ఈరోజు తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. ఐతే నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం తెలుగు ఫిలిమ్ ఛాంబర్ లో ఉంచారు. ఆ సమయంలో అభిమానులతో పాటు మతిస్థిమితం లేని వ్యక్తి తారకరత్న పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చాడు. చిరిగిన బట్టలు, చింపిరి జుట్టుతో ఉన్న ఆ వ్యక్తి, బాలకృష్ణ వైపు వేలు చూపిస్తూ ఏదో మాట్లాడాడు. బాలకృష్ణ కూడా అతడు మాట్లాడిన దానికి తలూపుతూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకు పోలీసులు ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.