Chiranjeevi: 'అమ్మే మొదటి దైవం'.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అమ్మ స్థానానికి మించినది మరొకటి లేదని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న అరుదైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
వివరాలు
తల్లే నిజమైన దైవం...
''మనకు కనిపించే ప్రతి దైవానికంటే ముందు తల్లే నిజమైన దైవం. అమ్మ మన జీవితంలో తొలి గురువు, అండగా నిలిచే ధైర్యం. మన విజయాల వెనుక ఆమె చేసిన త్యాగం దాగి ఉంటుంది. ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా మనకు ఆశీర్వాదంగా నిలిచేది తల్లే. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు'' అంటూ ఆయన సందేశం ఇచ్చారు. ఇక పలువురు సినీ ప్రముఖులు కూడా మదర్స్ డే సందర్భంగా తమ తల్లులపై ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు.
వివరాలు
తన తల్లిని గుర్తుచేసుకున్న హీరోయిన్..
నటి రాశీ ఖన్నా మాట్లాడుతూ, ''నువ్వు అచ్చం నీ అమ్మలాగే ఉంటావు అని చాలామంది చెప్పడం నాకు లభించిన గొప్ప ప్రశంస'' అని తెలిపారు. అలాగే నటి రుక్మిణి వసంత్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ, ''ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ముందుండే వ్యక్తి మా అమ్మ'' అని ప్రేమగా పేర్కొన్నారు.