Manchu Lakshmi: నా కోరిక మాత్రం ఒకటే.. కుటుంబ వివాదంపై స్పందించిన మంచు లక్ష్మి
ఈ వార్తాకథనం ఏంటి
తన కుటుంబంలో ఇలాంటి వివాదాలు ఎదురవుతాయని ఏ రోజూ ఊహించలేదని నటి మంచు లక్ష్మి స్పష్టం చేశారు. సినిమా ప్రచారాల కోసం ఇచ్చే ఇంటర్వ్యూలకు తప్ప, ప్రత్యేకంగా వ్యక్తిగత చర్చల కోసం మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపబోనని తెలిపారు. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె, తల్లి-సోదరి-కుమార్తెగా తన పాత్రల గురించి మాట్లాడుతూ, తల్లిగా మాత్రం తనను తాను 10కి 10 మార్కులు వేసుకుంటానని చెప్పింది. మంచు కుటుంబంలో జరిగిన విభేదాలపై కూడా ఆమె స్పందించారు. 'దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే... మా కుటుంబం మళ్లీ మునుపటిలాగే ఒక్కటిగా మారాలని మాత్రమే అడుగుతానని అన్నారు.
Details
మనకుండేదీ చివరి వరకూ రక్తసంబంధీకులే
ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉండటం సహజమే అయినా, ఎంత విభేదాలు వచ్చినా చివరకు అందరూ కలిసే ఉండాలనే భావన మనసులో నిలిచి ఉండాలని ఆమె పేర్కొన్నారు. భారతీయ కుటుంబాల్లో మాత్రం కొన్ని సందర్భాల్లో కలహాలు జీవితాంతం విరిగిపోనివ్వాలని భావించే ధోరణి కనిపిస్తుందని, అది సరికాదని వ్యాఖ్యానించారు. 'చివరికి మనకుండేది రక్తసంబంధీకులే. కుటుంబాన్ని కలిసి ఉంచేందుకు అవసరమైన పోరాటం చేయాలి; దూరం పెంచుకోవడం మాత్రం ఎప్పుడూ సరైంది కాదని తెలిపారు.
Details
బయటవాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు
'నేను ముంబయిలో ఉన్నాను. ఇక్కడి పరిస్థితులు తెలిసినా బాధపడలేదని కొందరు వార్తల్లో రాశారు. కానీ నేను పొందిన బాధను నాకు మాత్రమే తెలుసనని మంచు లక్ష్మి చెప్పారు. వివాదాలపై తాను మాట్లాడకపోవడంతో, కొందరు తమకు నచ్చినట్లుగా ఊహాగానాలు సృష్టించారని చెప్పారు. అది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి సమస్యలు వస్తాయని నేను ఊహించలేదు. వాటిని చూసి షాక్ అయ్యాను. నా కుటుంబం గురించి నేను అనుకున్నది, ఆ పరిస్థితుల్లో నాకు కలిగిన బాధ బయటివాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని భావించానని ఆమె వ్యాఖ్యానించారు.