Parva: మహాభారతం కథాంశంతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన కొత్త సినిమాను ప్రకటించారు.
'పర్వ- యాన్ ఎపిక్ టేల్ ఆఫ్ ధర్మ' పేరుతో కొత్త సినిమాను తెరకెక్కించనున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. మహాభారతం కథాంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
1979లో మహాభారతం ఆధారంగా డాక్టర్ ఎస్ఎల్ భైరప్ప రచించిన కన్నడ నవల 'పర్వ' దీనికి ప్రేరణ.
ఈ సినిమాను 3భాగాల్లో తెరకెక్కించేందుకు వివేక్ అగ్నిహోత్రి ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
దర్శకధీరుడు రాజమౌళి కూడా మహాభారతాన్ని తన కలల ప్రాజెక్ట్ అని గతంలోనే పేర్కొన్నారు. దానిని 10భాగాలుగా తెరకెక్కిస్తానని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
BIG ANNOUNCEMENT:
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 21, 2023
Is Mahabharat HISTORY or MYTHOLOGY?
We, at @i_ambuddha are grateful to the almighty to be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’:
PARVA - AN EPIC TALE OF DHARMA.
There is a reason why PARVA is called ‘Masterpiece of masterpieces’.
1/2 pic.twitter.com/BiRyClhT5c