Pawan Kalyan: పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి కాంబోలో భారీ సినిమా.. మార్చిలో షూటింగ్ స్టార్ట్?
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు తన సినీ ప్రయాణాన్ని కూడా పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. 'ఓజీ' సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న పవర్ స్టార్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' అనంతరం పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్ను లైనప్ చేశారు. ఈ చిత్రాన్ని 'జైత్ర రామ మూవీస్' బ్యానర్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా, వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Details
మిలిటరీ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మార్చి తొలి వారంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. పవర్ఫుల్ లుక్తో పాటు ఇంటెన్స్ క్యారెక్టర్లో ఆయన అభిమానులను అలరించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరో కూడా కీలక పాత్రలో నటించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.