R Madhavan: చాక్లెట్ బాయ్ నుండి 'పద్మశ్రీ': మాధవన్ కథ మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
చాక్లెట్ బాయ్గా పరిచయమైన, తర్వాత విలక్షణ నటుడిగా,దర్శకుడిగా మారిన ఆర్. మాధవన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. భాషా, ప్రాంత భేదాల పరిమితులు లేకుండా, దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకున్న ఆయన ప్రతిభకు ఈ గౌరవం నిదర్శనం. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'సఖి'(అలైపాయుతే)సినిమాతో యువతలో కలల రాకుమారుడిగా ప్రసిద్ధి చెందిన మాధవన్, ఆ ఇమేజ్లో స్థిరంగా ఉండకుండా విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేశారు. '3 ఇడియట్స్', 'విక్రమ్ వేద' వంటి సినిమాల్లో ఆయన నటనను ప్రేక్షకులు ప్రశంసించారు. తరువాత స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్' సినిమా,విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును కూడా గెలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
వివరాలు
కెనడాకు సాంస్కృతిక రాయబారిగా..
శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆయన అవగాహన, సినిమాలపై అంకితభావం ఆయనను ఈ స్థాయికి చేర్చాయి. మాధవన్ జార్ఖండ్లోని జంషెడ్పూర్లో తమిళ కుటుంబంలో జన్మించారు. తండ్రి టాటా స్టీల్లో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్గా, తల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పని చేశారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో విద్యాభ్యాసం పొందిన మాధవన్, కాలేజీ రోజుల్లో కెనడాకు సాంస్కృతిక రాయబారిగా భారతదేశాన్ని ప్రతినిధ్యం వహించడం విశేషం. అదనంగా సైనిక శిక్షణను కూడా పొందారు. సినిమాల్లోకి రాకముందు, మాధవన్ టెలివిజన్ రంగంలో తన కెరీర్ను ప్రారంభించి, సుమారు 1800 ఎపిసోడ్లలో నటించి అనుభవం సంపాదించారు.
వివరాలు
మాధవన్లోని మరో కోణం
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'అలైపాయుతే'(తెలుగులో 'సఖి')చిత్రంతో వెండితెరకు పరిచయమైన మాధవన్, ఆ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత'చాక్లెట్ హీరో'గా పేరు తెచ్చుకుని,యువతలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ను సంపాదించారు. రేహనా హై తేరే దిల్ మే,3 ఇడియట్స్, తనూ వెడ్స్ మను,రంగ్ దే బసంతి వంటి హిందీ సినిమాల ద్వారా బాలీవుడ్లో స్థిరమైన స్థానం సంపాదించారు. రొమాంటిక్ పాత్రలతోపాటు సీరియస్, ఇంటెన్స్ పాత్రలలోనూ తన ప్రతిభను చాటారు. ఆడపా, దడపా,విక్రమ్ వేద వంటి సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నారు. గత సంవత్సరం,దర్శకుడిగా మారి భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితకథ ఆధారంగా రూపొందించిన'రాకెట్రీ' సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ చిత్రం మాధవన్లోని మరో కోణాన్ని ప్రజలకు చూపించింది.