LOADING...
Mahesh Babu: రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ హైప్.. "SSMB29" టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ గ్లోబల్ ఈవెంట్‌లో రిలీజ్
రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ హైప్.. "SSMB29" టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ గ్లోబల్ ఈవెంట్‌లో రిలీజ్

Mahesh Babu: రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ హైప్.. "SSMB29" టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ గ్లోబల్ ఈవెంట్‌లో రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమాకు కొత్త పుంతలు తొక్కిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. 'బాహుబలి' సిరీస్‌తో భారత సినిమాను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టిన ఆయన, 'ఆర్ఆర్ఆర్‌'తో ఆస్కార్‌లో దృష్టి ఆకర్షించారు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి మరొక భారీ ప్రాజెక్ట్‌ "SSMB29" కోసం సిద్ధమవుతున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా భారత సినీ చరిత్రలో అత్యంత భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఎస్‌.గోపాల్‌ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు, యాక్షన్ స్టంట్ మాస్టర్స్‌, టాప్ నాచ్ VFX ఆర్టిస్టులు ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. రాజమౌళి గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలతో టైఅప్‌లను కూడా ఫైనలైజ్ చేస్తున్నారు.

Details

కీలక పాత్రలో మాధవన్

ప్రపంచ ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్‌తో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆడ్వెంచర్ యాక్షన్ డ్రామా జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో మహేశ్ బాబు "గ్లోబల్ ఎక్స్‌ప్లోరర్" పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ సూపర్‌స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్, నటుడు మాధవన్ కీలక పాత్రల్లో ఉంటారు. ఇప్పటి వరకు ఆఫ్రికా అడవులు, దక్షిణ అమెరికా అమెజాన్ బేసిన్, ఐస్‌లాండ్ వంటి విభిన్న లొకేషన్లలో చిత్రీకరణ పూర్తయింది. యూనిట్ ప్రస్తుతం తదుపరి షెడ్యూల్‌ కోసం సిద్ధమవుతోంది.

Details

ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న బిగ్ అప్‌డేట్ 

తాజా సమాచారం ప్రకారం నవంబర్ 16న రాజమౌళి 'SSMB29' టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. ఈ అప్‌డేట్ హాలీవుడ్ స్థాయిలో గ్రాండ్ ఈవెంట్‌లో ప్రదర్శించనుంది. ఈ ఈవెంట్‌కి 'అవతార్' దర్శకుడు జేమ్స్ కామెరూన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన 'Avatar: Fire and Ash' ప్రమోషన్ కోసం ఇండియాకు రాబోతున్న నేపథ్యంలో, గ్లోబల్ లెవల్‌లో ఈ అప్‌డేట్‌ను రిలీజ్ చేయాలని రాజమౌళి ప్రణాళిక రూపొందించారు. ఇంటర్నేషనల్ హైప్‌కి కొత్త మైలురాయి ఈ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా హైప్‌కు కొత్త మైలురాయి అవుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద 'SSMB29'తో మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్ మరోసారి భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్‌కి తీసుకెళ్లనుందని పరిశ్రమలో నమ్మకం పెరుగుతోంది.