
SSMB 29 : మహేష్ ఎంట్రీ సీన్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్పై రోజుకో కొత్త రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, వచ్చే షెడ్యూల్లో మహేష్బాబు ఎంట్రీ సీన్ చిత్రీకరణ జరగనుంది. ఈ ఎంట్రీ సీన్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా పాల్గొననున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్, ప్రియాంకా పాత్రలను పరిచయం చేయడమే కాకుండా, ఈ సీక్వెన్స్లోనే కథ దిశను ప్రేక్షకులకు రివీల్ చేయనున్నట్లు సమాచారం.
Details
నవలల ఆధారంగానే సినిమా కథ
విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ హుక్ - ఇవన్నీ కలిసిన ఈ ఎంట్రీ సీన్ సినిమా హైలైట్గా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే, విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. "నేనూ రాజమౌళి కూడా దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ నవలలకు పెద్ద అభిమానులం. ఆయన రచనలే మాకు ఎంతో ప్రేరణనిచ్చాయి. ఈ సినిమా కథ కూడా ఆయన నవలల ఆధారంగానే రూపొందించిందని పేర్కొన్నారు. దీంతో సినిమా ఓ రోమాంచక అడ్వెంచర్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది.