కొరియన్ అంబాసిడర్ కు నాటు స్టెప్పులు నేర్పించిన రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేయని వారు ఎవ్వరూ లేరు. ఆస్కార్ అందుకున్న పాటకు అందరూ కాళ్ళు కదిలించారు. తాజాగా కొరియన్ అంబాసిడర్ కూడా నాటు నాటు అంటూ స్టెప్పులు వేసాడు. ఈ స్టెప్పులకు జీ 20సమ్మిట్ వేదిక అయ్యింది. కాశ్మీర్ లో జరుగుతున్న జ 20 సమ్మిట్ కు వివిధ దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. భారతీయ చలనచిత్ర రంగ ప్రతినిధిగా రామ్ చరణ్ హాజరయ్యారు. తెలుగు ఇండస్ట్రీ నుండి ఇలాంటి ప్రపంచ సమావేశాలకు ప్రతినిధిగా వెళ్ళిన మొదటివాడిగా రామ్ చరణ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సమావేశంలో కాశ్మీర్ గురించిన మాట్లాడిన చరణ్, తనకు కాశ్మీర్ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పుడు 1986లో మొదటిసారి కాశ్మీర్ వచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడిన రామ్ చరణ్
వేసవి సెలవుల్లో కాశ్మీర్ కు వెళ్ళడం చాలా ఆసక్తిగా ఉండేదనీ రామ్ చరణ్ మాట్లాడాడు. అనంతరం, కొరియన్ అంబాసిడర్ చాంగ్ జే బోక్ తో కలిసి వేదిక మీద నాటు నాటు పాటకు స్టెప్పులు వేసాడు. స్టేజి మీదే నాటు నాటు పాట స్టెప్పులను చాంగ్ జే కు నేర్పించాడు. ఈ వీడియోను పర్యాటక మంత్రిత్వశాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ సమ్మిట్ లో రామ్ చరణ్ తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ, హాలీవుడ్ లో సినిమా చేసినా కూడా షూటింగ్ మాత్రం ఇండియాలోనే ఉంటుందని అన్నాడు.