Page Loader
సంక్షిప్తం చేయు
Rashmika: ఒకరిపై ఒకరు దయతో ఉండండి.. రష్మిక ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌
ఒకరిపై ఒకరు దయతో ఉండండి.. రష్మిక ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

Rashmika: ఒకరిపై ఒకరు దయతో ఉండండి.. రష్మిక ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్న (Rashmika) ఇటీవల పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

తన సినిమా విశేషాలను పంచుకునే ఆమె, తాజాగా "దయగా ఉండండి" అనే సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

''ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతోంది. నేను మాత్రం అందరినీ సమానంగా చూస్తాను. మీరు కూడా అలానే ఉండండి. ఒకరిపై ఒకరు దయగా ఉండాలి'' అని రాశారు.

ఆమె ధరించిన టీ షర్ట్‌ మీద కూడా "దయ" అనే పదం రాసి ఉంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.

వివరాలు 

రష్మికకు సాయం చేయొచ్చు కదా?

తాజాగా, రష్మిక, విజయ్‌ దేవరకొండ జిమ్‌లో కలిసి కనిపించిన వీడియో ఒకటి వైరల్ అయింది.

అయితే, జిమ్‌ నుంచి బయటకు వచ్చిన విజయ్‌ కారులో కూర్చొని ఉండగా, రష్మిక తన కాలికి గాయం కారణంగా కాస్త ఇబ్బందిపడుతూ కారు ఎక్కారు.

ఈ వీడియోపై కొన్ని వ్యక్తులు విజయ్‌ను విమర్శిస్తూ "రష్మికకు సాయం చేయొచ్చు కదా?" అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యం లో రష్మిక పోస్ట్‌ మరింత వైరల్‌గా మారింది.

వివరాలు 

 సల్మాన్‌ ఖాన్‌తో కలిసి సికందర్ సినిమా 

సినిమాల విషయానికొస్తే, రష్మిక నటించిన ''ఛావా'' సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇది ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం.

శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్‌, ఆయన భార్యగా రష్మిక నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది.

అదే సమయంలో, సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ''సికందర్'' చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇంకా, ''థామ'', ''కుబేర'', ''ది గర్ల్‌ఫ్రెండ్'', ''రెయిన్‌ బో'' వంటి చిత్రాలతో కూడా రష్మిక బిజీగా ఉన్నారు.