NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Prabhas: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు 2 కోట్లు సాయం ప్రకటించిన ప్రభాస్ 
    తదుపరి వార్తా కథనం
    Prabhas: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు 2 కోట్లు సాయం ప్రకటించిన ప్రభాస్ 
    తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు 2 కోట్లు సాయం ప్రకటించిన ప్రభాస్

    Prabhas: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు 2 కోట్లు సాయం ప్రకటించిన ప్రభాస్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 04, 2024
    01:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల్లో వరదలు తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరదల ప్రభావంతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

    రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి.

    సినీ రంగం కూడా వరద బాధితుల సహాయం కోసం ముందుకొచ్చింది. స్టార్ హీరోలు,నిర్మాతలు భారీ విరాళాలను ప్రకటించారు.

    వివరాలు 

    ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు రూ. 2 కోట్లు 

    'అయ్' మూవీ యూనిట్,'కల్కి' నిర్మాతలు అశ్విని దత్త (రూ. 25 లక్షలు),ఎన్టీఆర్ (తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 1 కోటి),విశ్వక్ సేన్ (రూ. 10 లక్షలు),సిద్ధూ జొన్నలగడ్డ(రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 30 లక్షలు),సూపర్ స్టార్ మహేష్ బాబు(రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 1 కోటి),బాలకృష్ణ (రూ. 1 కోటి),పవన్ కళ్యాణ్ (రూ. 1 కోటి),నటి అనన్య నాగళ్ళ(రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 5 లక్షలు) విరాళాలు అందించారు.

    తాజాగా, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వరద బాధితుల సహాయానికి భారీ విరాళాన్ని ప్రకటించారు.

    ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. 2 కోట్లు అందించారు.అలాగే, వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు,తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.

    వివరాలు 

    శాంతిస్తున్న కృష్ణా నది 

    ఆయన చేసిన ఈ విరాళంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా భారీ వరదలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేశాయి.

    కృష్ణా నదీ ప్రవాహం ఇప్పుడు నెమ్మదిగా శాంతిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం వరకు నీటిమట్టం మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

    చరిత్రలో ఎన్నడూ లేని 11.47 లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడింది. అయితే, ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    ప్రభాస్

    Prabhas SalaarMovie Review: ప్రభాస్ 'సలార్' మూవీ Review.. ఇంట్రెస్ట్‌గా సాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా! సలార్
    Salaar: విషాదం.. ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని మృతి సలార్
    Salaar OTT: సలార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. రికార్డు ధరకు కొనుగోలు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? సలార్
    'సలార్'తో పాటు.. 2023లో తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే..  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025