సాయి పల్లవి డ్యాన్సుకు జడ్జిగా మార్కులేసిన సమంత; వీడియో వైరల్
సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ ప్రోగ్రామ్ లో తన డ్యాన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ కి ఒకానొకసారి జడ్జిగా సమంత వెళ్ళింది. సాయిపల్లవి డ్యాన్స్ చూసి, పొగడ్తలతో ముంచెత్తింది సమంత. సాయిపల్లవి డ్యాన్స్ గురించి సమంత మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సాయి పల్లవి డ్యాన్స్ చేస్తుంటే, చూపు తిప్పుకోలేకపోయానని, అద్భుతంగా ఉందని సమంత మాట్లాడుతుంటే, థ్యాంక్స్ అంటూ ఆనందపడింది సాయిపల్లవి. అదలా ఉంచితే, సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఖుషి సినిమాలో నటిస్తోంది. అలాగే సిటాడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ లో పాల్గొంటుంది.