
Chiranjeevi: మెగాస్టార్కు శివ రాజ్కుమార్ శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్లోనే భోజనం
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆదివారం కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
బెంగళూరు నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్కు వచ్చి మెగాస్టార్కు విషెష్ చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్( ఎక్స్) ద్వారా వెల్లడించారు.
ప్రియమైన స్నేహితుడు శివన్న తన కోసం హైదరాబాద్కు వచ్చిన శుభాకాంక్షలు తెలిపినట్లు చిరంజీవి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇద్దరం కలిసి భోజనం చేశామని, చాలాసేపు మాట్లాడుకున్నామని, శివన్న తండ్రి రాజ్ కుమార్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫొటోలను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
Very touched that my dear @NimmaShivanna came all the way from Bangalore to congratulate me 🤗
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 4, 2024
Spent some wonderful time over lunch and fondly recalled our association and so many cherished memories with the Legendary Rajkumar garu and his entire family.🙏 Delighted. pic.twitter.com/gbWizevDso