LOADING...
Santosham Awards : సౌత్ ఇండియన్ సంతోషం అవార్డ్స్.. కన్నప్ప సినిమాకు మూడు తరాలకు గౌరవం
సౌత్ ఇండియన్ సంతోషం అవార్డ్స్.. కన్నప్ప సినిమాకు మూడు తరాలకు గౌరవం

Santosham Awards : సౌత్ ఇండియన్ సంతోషం అవార్డ్స్.. కన్నప్ప సినిమాకు మూడు తరాలకు గౌరవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2025
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ (Santosham Awards) వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీ దత్, మురళీ మోహన్, మోహన్ బాబు, విష్ణు మంచు, మాలశ్రీ, బాబు మోహన్ తదితర సితార్లు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో, వైజయంతి మూవీస్ స్థాపన 50వ సంవత్సరానికి చేరిన సందర్భంగా నిర్మాత అశ్వినీ దత్‌కి ప్రత్యేక సన్మానం చేశారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. మోహన్ బాబు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, మంచు విష్ణు బెస్ట్ హీరోగా, మంచు మూడో తరం అవ్రామ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'కన్నప్ప' సినిమాకు అవార్డులు గెలుచుకున్నారు.

Details

నటి జోర్దార్ సుజాతకు అవార్డు

కోట శ్రీనివాసరావు స్మారక అవార్డును బాబు మోహన్, మురళీ మోహన్‌కు అందజేశారు. పాటల రచయితగా 25 సంవత్సరాలు పూర్తి చేసిన భాస్కర భట్ల రవికుమార్‌ను కూడా ప్రత్యేకంగా సన్మానించారు. అజయ్ ఘోష్, శరణ్య ప్రదీప్, కీర్తన శర్మ, విజయ్ పొలంకి, చంద్ర హాస్, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి, డైరెక్టర్ యదు వంశీ, మధుప్రియ, శివాజీ, డైలాగ్ రైటర్ ఆకెల్ల శివప్రసాద్, 7 హిల్స్ ప్రొడ్యూసర్ సతీష్, రేవు మూవీ ప్రొడ్యూసర్ మురళీ గింజుపల్లి తదితరులు వివిధ విభాగాల్లో బాబు మోహన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఓటీటీ విభాగంలో 90sసిరీస్‌లో నటించిన హాసన్, రోహన్ రాయ్‌లకు అవార్డులు లభించగా, నటి జోర్దార్ సుజాతకు కూడా ఓటీటీ కేటగిరీలో అవార్డు అందింది.