Hanu-Man: అయోధ్య రామమందిరానికి 'హనుమాన్' టీమ్ ఎన్ని కోట్లు విరాళంగా ఇచ్చిందో తెలుసా?
హను-మాన్ బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని కొనసాగిస్తోంది. ప్రశాంత్ వర్మ- తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా.. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్టకు ఒక రోజు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ప్రతి టికెట్కు రూ.5ను అయోధ్య రామాలయానికి విరాళంగా ఇస్తామని చిత్రం బృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్ సమయంలో ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారమే సినిమా నిర్మాత సదరు మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ప్రత్యేక ప్రీమియర్ షోలతో పాటు ఇప్పటి వరకు 53,28,211 టిక్కెట్లను విక్రయించారు. ఒక్కో టికెట్కు రూ.5 చొప్పున మొత్తం రూ.2,66,41,055ను అయోధ్య రామాలయానికి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో చిత్ర యూనిట్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.