LOADING...
NTR-Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

NTR-Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది ఓ మైలురాయి సినిమాగా నిలవాలనే లక్ష్యంతో ప్రశాంత్ నీల్ ఎంతో శ్రమిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నింటికంటే ఇది బెస్ట్‌గా ఉండేలా యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి రవి బస్రూర్ పవర్‌ఫుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కాస్టింగ్‌నే సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

Details

జూన్ 25న రిలీజ్

అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ ఏడాది జూన్ 25న ఈ యాక్షన్ విస్ఫోటనం థియేటర్లలో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ మాస్ మేనియా, ప్రశాంత్ నీల్ ఎలివేషన్లు కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు విశ్వసిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తయినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ఎక్కువగా నైట్ ఎఫెక్ట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ టీమ్‌కు చెందిన ప్రజ్వల్ గౌడ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు టాక్.

Advertisement