
K.Mahendra: సీనియర్ ప్రొడ్యూసర్ కె.మహేంద్ర కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సీనియర్ నిర్మాత, ఏఏ ఆర్ట్స్ అధినేత కె. మహేంద్ర (79) కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహేంద్ర గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కన్నుమూశారు.
ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం గుంటూరులో నిర్వహించనున్నారు.
1946లో జన్మించిన మహేంద్ర తన సినీ జీవితాన్ని ప్రొడక్షన్ కంట్రోలర్గా ప్రారంభించారు.
అనంతరం దర్శకత్వ శిక్షణ పొంది నిర్మాతగా మారారు.
ఆయన సుమారు 50కి పైగా సినిమాలను నిర్మించారు. గీతా ఆర్ట్స్ పిక్చర్స్తో పాటు, స్వంతంగా స్థాపించిన ఏఏ ఆర్ట్స్ బ్యానర్పై కూడా అనేక చిత్రాలను నిర్మించారు.
వివరాలు
శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన ఏఏ ఆర్ట్స్ బ్యానర్
తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు మారిన తరువాత, ఏఏ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా శ్రీహరిని హీరోగా పరిచయం చేశారు.
1977లో 'ప్రేమించి పెళ్లి చేసుకో' అనే చిత్రంతో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
అయన నిర్మాణంలో వచ్చిన ప్రముఖ చిత్రాల్లో 'ఏది పుణ్యం? ఏది పాపం?', 'ఆరని మంటలు', 'తోడు దొంగలు', 'బందిపోటు రుద్రమ్మ', 'ఎదురులేని మొనగాడు', 'ఢాకూరాణి', 'ప్రచండ భైరవి', 'కనకదుర్గ వ్రత మహాత్మ్యం' వంటి సినిమాలు ఉన్నాయి.