Loading...
Tollywood Ticket Prices: టాలీవుడ్‌లో టికెట్‌ ధరలపై మరోసారి చర్చ.. కొత్త కమిటీని నియమించిన ఫిల్మ్‌ ఛాంబర్
టాలీవుడ్‌లో టికెట్‌ ధరలపై మరోసారి చర్చ.. కొత్త కమిటీని నియమించిన ఫిల్మ్‌ ఛాంబర్

Tollywood Ticket Prices: టాలీవుడ్‌లో టికెట్‌ ధరలపై మరోసారి చర్చ.. కొత్త కమిటీని నియమించిన ఫిల్మ్‌ ఛాంబర్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 05, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ పరిశ్రమలో సినిమా టికెట్‌ ధరలు, థియేటర్లలో అమలవుతున్న రెవెన్యూ పంపిణీ (పర్సెంటేజ్‌) విధానంపై మరోసారి చర్చ జోరందుకుంది. ఈ రెండు కీలక అంశాలను సమగ్రంగా పరిశీలించి, పరిశ్రమకు అనుకూలమైన సూచనలు అందించేందుకు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న పాత కమిటీని రద్దు చేసిన ఛాంబర్‌, దాని స్థానంలో ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని నియమించింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను సేకరించి, టికెట్‌ ధరల నిర్ణయం, థియేటర్లలో అమలవుతున్న పర్సెంటేజ్‌ విధానం వంటి అంశాలపై ఈ కమిటీ విస్తృత స్థాయిలో చర్చించి తగిన సూచనలు చేయనుంది.

వివరాలు

కొత్త మార్గదర్శకాలు అమల్లోకి..

అయితే కమిటీ తన నివేదికను ఎప్పటిలోగా సమర్పించాలనే విషయంలో ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎలాంటి గడువును నిర్దేశించలేదు.

అన్ని వర్గాల అభిప్రాయాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, తొందరపాటు నిర్ణయాలకు పోకుండా పరిశ్రమకు దీర్ఘకాలంలో మేలు చేసే పరిష్కారాలను రూపొందించాలనే ఉద్దేశంతో కమిటీకి అవసరమైన సమయాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో టికెట్‌ ధరలు, రెవెన్యూ షేరింగ్‌ విధానంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ యాజమాన్యాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్త కమిటీ ఏర్పాటు ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ కమిటీ సమర్పించే నివేదిక, సిఫార్సుల ఆధారంగా భవిష్యత్తులో టాలీవుడ్‌లో టికెట్‌ ధరలు, పర్సెంటేజ్‌ విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ADVERTISEMENT