ప్రముఖ నటి వహీదా రెహ్మాన్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ప్రముఖ నటి వహీదా రెహ్మాన్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ ఎంపికైనట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. భారత చలన చిత్ర పరిశ్రమకు 5 దశాబ్దాలుగా సేవలు అందించినందుకు గాను ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె మొదటగా 1955లో తెరకెక్కిన'రోజులు మారాయి'సినిమాతో తెలుగులో తెరంగ్రేట్రం చేశారు. ఆ చిత్రంలోని 'ఏరువాక సాగారో రన్నో..'పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆటు తర్వాత 1956లో సీఐడీ (CID) చిత్రంతో బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదవి కా చంద్, సాహెబ్ బీవీ ఔర్ గులాం, గైడ్, సైలెన్స్