
Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన విజయ్ ఆంటోనీ ..
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ ఆంటోనీ హీరోగా స్వయంగా దర్శకత్వం వహించి రూపొందించిన చిత్రం "బిచ్చగాడు".ఈ సినిమా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా ఇప్పటికే రెండో భాగం విడుదలై ఉంది. ఇక మూడో భాగం కూడా రాబోతుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా దానిపై హీరో విజయ్ ఆంటోనీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం "మార్గన్" విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ సందర్భంగా వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని వచ్చిన వార్తలను విజయ్ పూర్తిగా కొట్టిపారేశారు. ప్రజల్లో గుర్తింపు ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి వెళ్లటం తగదని తాను భావిస్తున్నట్టు స్పష్టం చేశారు.
వివరాలు
మార్గన్ సినిమాకు సీక్వెల్
"నా దర్శకత్వంలో మరోటి కాకుండా మరిన్ని సినిమాలు చేయబోతున్నాను. ప్రస్తుతం మార్గన్ తర్వాత "బిచ్చగాడు-3" రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది.దీనిని కూడా నేను స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాను. 2027లో ఈ సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ఇంకా పూర్తికాలేదు. త్వరలోనే సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తాం. మార్గన్ మూవీని చూసే ప్రేక్షకులకు ఇది ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని నమ్మకంగా ఉన్నాను. అలాగే కన్నప్ప సినిమాకు మా సినిమాతో ఎలాంటి పోటీ లేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఆ సినిమా పెద్ద హిట్ కావాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఇక మార్గన్ సినిమాకు సంబంధించిన సీక్వెల్ విషయాన్నిఇప్పటికే కథలో భాగంగా వివరించాం" అంటూ విజయ్ ఆంటోనీ తెలిపారు.