విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ
సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న విరూపాక్ష టీజర్, ఇంతకుముందే విడుదలైంది. ఒకానొక గ్రామంలో ఎప్పుడూ లేనట్టుగా ఏదో ఒక వింత జరుగుతుంది. చరిత్రలో అలా జరగడం అదే మొదటిసారని సినిమాలోని ఒక పాత్ర చెబుతుంది. దాన్ని బట్టి ఇదేదో ఇంతవరకెప్పుడూ చూడని రహస్యాన్ని చూపెట్టబోతున్నట్టుగా అనిపించింది. ఇక ఆ రహస్యాన్ని చేధించాలంటే ఒకటే మార్గం ఉందని సాయి చంద్ పాత్ర అంటుంది. అప్పుడే హీరో ఎంట్రీ ఇస్తాడు. విరూపాక్ష టీజర్ సాయి ధరమ్ తేజ్ చాలా గంభీరంగా కనిపించాడు. సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే ఉంటుందనే డైలాగ్ చెప్పిన సాయి ధరమ్ తేజ్, సమస్యను కనుక్కునే పనిలో పడతాడని అర్థమవుతుంది.
విరూపాక్ష టీజర్ లోని భయపెట్టే లాస్ట్ షాట్
ఐతే విరూపాక్ష టీజర్ లో, ఆ గ్రామంలో అసలేం జరిగిందనేది చూపించలేదు. ఇలాంటి సస్పెన్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నట్టు అర్థమవుతోంది. టీజర్ కి తగినట్టుగా మ్యూజిక్ కుదిరింది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందీ? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందన్న దానికి సమాధానంగా టీజర్ లోని చివరి షాట్ నిలుస్తుందని చెప్పవచ్చు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కార్తీక దండు డైరెక్ట్ చేస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపిస్తోంది. బీ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను, 2023 ఏప్రిల్ 21వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.