Dhurandhar: ధురంధర్..సినిమా నిడివి,ముఖ్యమైన సన్నివేశాలు తీసేయడంపై ఫాన్స్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. బాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ బ్లాక్బస్టర్ 'ధురంధర్' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లోనూ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మాత్రం కేవలం హిందీలోనే విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు రీజినల్ భాషల్లోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1300 కోట్ల కలెక్షన్లతో సెన్సేషన్ సృష్టించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ధురంధర్-2 పై నిలిచింది.
వివరాలు
రిలీజ్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఫిర్యాదులు
ఇదిలా ఉండగా, నెట్ ఫ్లిక్స్పై ప్రేక్షకుల అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. థియేటర్లలో చూసిన ఒరిజినల్ వెర్షన్తో పోలిస్తే, ఓటీటీలో వచ్చిన వెర్షన్ నిడివి తక్కువగా ఉందంటూ అభిమానులు మండిపడుతున్నారు. అంతేకాదు, వీడియో క్వాలిటీ కూడా ఆశించిన స్థాయిలో లేదని విమర్శిస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమా నిడివి 3 గంటల 45 నిమిషాలుగా ఉండగా, నెట్ఫ్లిక్స్ వెర్షన్ మాత్రం 3 గంటల 25 నిమిషాలకే పరిమితమైంది. అంటే దాదాపు 9 నుంచి 10 నిమిషాల కీలక సన్నివేశాలను తొలగించినట్లు అభిమానులు చెబుతున్నారు. ఓటీటీలో రిలీజ్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
వివరాలు
పవర్ఫుల్ డైలాగ్స్ను మ్యూట్ చేయడంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం
ముఖ్యంగా సినిమాలోని కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ను మ్యూట్ చేయడంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలను పూర్తిగా కట్ చేయడం సరైంది కాదని అంటున్నారు. సినిమా ఇప్పటికే ఏ-సర్టిఫికేట్ పొందినప్పటికీ, మళ్లీ సెన్సార్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఓటీటీలో అన్కట్ వెర్షన్ చూడాలని ఆశించామని, ఇలా మార్పులు చేస్తే సినిమా సహజత్వం దెబ్బతింటుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సుమారు 10 నిమిషాల సన్నివేశాలను తొలగించడం వల్ల కథా ప్రవాహంపై కూడా ప్రభావం పడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ఇప్పటికీ థియేటర్లలో..
ఈ సినిమాలో పాకిస్తాన్లో భారత గూఢచార ఏజెంట్లు నిర్వహించే రహస్య ఆపరేషన్లు, భారత్పై దాడులకు పాకిస్తాన్ మాఫియా, ఐఎస్ఐ, రాజకీయ నేతల మధ్య ఉండే నెక్సస్ ఎలా పనిచేస్తుందన్న అంశాలను చూపించారు. IC-814 విమాన హైజాక్ ఘటన, 2001 పార్లమెంట్ దాడి, ముంబై ఉగ్రదాడుల వంటి కీలక సంఘటనలను కూడా కథలో భాగంగా చూపించడం విశేషం. డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఇక ధురంధర్-2 మార్చి 19న థియేటర్లలో విడుదల కానుండగా, అదే రోజు యష్ నటించిన 'టాక్సిక్' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.