Page Loader
Uttarakhand: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 10 మంది గల్లంతు 
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 10 మంది గల్లంతు

Uttarakhand: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 10 మంది గల్లంతు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 10 మంది అదృశ్యమైనట్టు సమాచారం. అధికారుల ప్రకారం ఈ ప్రమాదం సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి: ఈ సంఘటన రుద్రప్రయాగ్ జిల్లా ఘోల్తీర్ ప్రాంతంలో జరిగింది. బద్రీనాథ్‌ నుండి బయలుదేరిన పర్యాటకుల బస్సు ప్రయాణమధ్యలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు ప్రారంభించారు.

వివరాలు 

బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన 10 మందికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలకనంద నది కూడా పొంగిపొర్లడంతో సహాయక చర్యలు చేపట్టే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం