NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు
    భారతదేశం

    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు

    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 18, 2023, 12:30 pm 0 నిమి చదవండి
    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు
    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు

    12 చిరుతలతో దక్షిణాఫ్రికా నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకుంది. గతేడాది నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకొచ్చిన కేంద్రం, తాజాగా మరో 12 చిరుతలను తీసుకొచ్చింది. ఆ చిరుతలను ప్రత్యేక హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్క్‌కు తరలించనున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కునో నేషనల్ పార్క్‌లోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలోకి తొలుత ఆ చిరుతలను విడుదల చేయనున్నారు. కొత్తగా తీసుకొచ్చిన వాటిలో ఏడు మగ, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి. దేశంలో అంతరించిపోయిన చిరుతల సంఖ్యను పెంచాలని కేంద్రం మూడేళ్ల క్రితం నిర్ణయించింది. అందులో భాగంగానే దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకొచ్చారు.

    భారత్‌లో 1947లో మరణించిన చివరి చీతా

    కునో నేషనల్ పార్క్‌లో 10 క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ వన్యప్రాణుల చట్టాల ప్రకారం, విదేశాల నుంచి దేశంలోకి వచ్చిన జంతువులను 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. అందులో భాగంగానే ప్రస్తుతం తీసుకొచ్చిన చిరుతలను క్వారంటైన్‌లో ఉంచనున్నారు. భారత్‌లో 1947లో చివరి చిరుత మరణించింది. 1952లో దేశంలో ఈ జాతి అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం ప్రకటించబడింది. 2020లో ఉపజాతులైన ఆఫ్రికన్ చిరుతలను దేశంలోకి తీసుకురావచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జంతువులను తిరిగి దేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    మధ్యప్రదేశ్
    దక్షిణ ఆఫ్రికా

    మధ్యప్రదేశ్

    హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు హైదరాబాద్
    కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం తాజా వార్తలు
    వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి  ఇండోర్
    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు  రాహుల్ గాంధీ

    దక్షిణ ఆఫ్రికా

    అంతర్జాతీయ క్రికెట్ కు షబ్మిమ్ ఇస్మాయిల్ గుడ్‌బై క్రికెట్
    మార్ర్కమ్ సునామీ ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా ప్రపంచకప్ బెర్తు ఖరారు! క్రికెట్
    టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న రీజా హెండ్రిక్స్ క్రికెట్
    మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం ప్రపంచం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023