NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Necrotizing fasciitis disease: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. కండరాలు తినేసిన బ్యాక్టీరియా! 
    తదుపరి వార్తా కథనం
    Necrotizing fasciitis disease: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. కండరాలు తినేసిన బ్యాక్టీరియా! 
    అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. కండరాలు తినేసిన బ్యాక్టీరియా!

    Necrotizing fasciitis disease: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. కండరాలు తినేసిన బ్యాక్టీరియా! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 26, 2024
    09:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అత్యంత అరుదుగా కనిపించే "నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌" అనే వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల భవదీప్‌ కుటుంబం తల్లడిల్లిపోతోంది.

    సాధారణంగా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి చిన్నపిల్లల్లో దర్శనమివ్వడం ఆందోళనకరం.

    భవదీప్‌ శరీరంలో ఎలాంటి గాయాలు లేకపోయినా, ప్రమాదకర బ్యాక్టీరియా ప్రవేశించడం వైద్యులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

    ఈ బ్యాక్టీరియా అతని కుడి కాలును పూర్తిగా తినేయడంవల్ల, అతని కాలును తొడ వరకు తొలగించాల్సి వచ్చింది.

    ఎడమ కాలులోని కండరాలపై 30% నష్టం వాటిల్లింది. నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌కు మరో పేరు "ఫ్లెష్‌ ఈటింగ్‌ డిసీజ్‌".

    విజయవాడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవదీప్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది.

    వివరాలు 

    వణుకు..జ్వరంతో.. వ్యాధి ప్రారంభం

    ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన భవదీప్‌ కుటుంబం ఈ నెల మొదట్లో వరదలో చిక్కుకుంది.

    వరదనీరు తగ్గే వరకు భవదీప్‌ నీటిలోనే ఉన్నాడు. చిన్నచిన్న పనులు కూడా చేశాడు.

    ఆ రాత్రి వణుకు, చలి, జ్వరం వచ్చిన తర్వాత, స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు.

    కానీ, ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డెంగీ అని భావించారు.

    ఆ తర్వాత అతని కాళ్లలో వాపు రావడంతో విజయవాడలోని కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు.

    పరీక్షల్లో సూక్ష్మక్రిములు కండరాలను నాశనం చేస్తున్నాయని గుర్తించి, కుడి కాలును తొలగించారు.

    వివరాలు 

    ప్రమాదజాతుల సూక్ష్మక్రిములే వ్యాధికి కారణం

    భవదీప్‌ శరీరంలో ఈ-కోలి, క్లెబిసెల్లా బ్యాక్టీరియాలు ప్రవేశించాయని వైద్యులు నిర్ధారించారు.

    వీటిలో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండడం వల్లనే కాలువాపు వచ్చిందని తెలిపారు.

    వరద నీటిలో మురుగునీరు కలవడం, వ్యాధి కారక సూక్ష్మక్రిములు ఎక్కువగా వ్యాప్తి చెందడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరించారు.

    అలాగే, భవదీప్‌ను జ్వరంతో బాధపడుతున్న సమయంలో స్థానిక వైద్యుడు ఇచ్చిన యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు వ్యాధిని మరింత తీవ్రమైన స్థితికి చేర్చాయని చెప్పారు.

    ప్రస్తుతం భవదీప్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు, ఎడమ కాలు నెమ్మదిగా నయమవుతోంది.

    పూర్తిగా కోలుకునేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయవాడ సెంట్రల్

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    విజయవాడ సెంట్రల్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విద్యుత్
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025