NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు 
    తదుపరి వార్తా కథనం
    Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు 
    మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు

    Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 13, 2025
    12:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది.

    పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ప్రత్యేకంగా 144 సంవత్సరాల తర్వాత జరగనుంది. సాధారణంగా ప్రతి ఆరుసంవత్సరాలకోసారి అర్ధ కుంభమేళా, 12 సంవత్సరాలకోసారి కుంభమేళా నిర్వహించడం అనవాయితీ.

    కానీ ఈ సారి మహా కుంభమేళా 144 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నారు. ఈ మహా కుంభమేళా మరింత ప్రత్యేకంగా ఉండనుంది.

    ఎందుకంటే ఇది ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో కాకుండా. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం దాదాపు 45 రోజుల పాటు కొనసాగుతుంది.

    40 కోట్ల మంది భక్తులు, పర్యాటకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేసింది.

    Details

     1,176 సీసీ కెమెరాలు ఏర్పాటు 

    భారతదేశం సహా, వివిధ దేశాల నుండి భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొంటారు. ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు, పర్యాటకులు చేరుకునేందుకు భారతీయ రైల్వే ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేసింది.

    వారి ప్రయాణానికి సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతంలోని తొమ్మిది స్టేషన్లలో రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం 1,176 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

    ప్రయాణికుల సౌకర్యం కోసం 12 భాషల్లో ప్రకటన వ్యవస్థను ఏర్పాటు చేశారు. కుంభమేళా సమయంలో 10,000 సాధారణ రైళ్లతో పాటు 3,134 ప్రత్యేక రైళ్లను నడిపిస్తారు.

    ఇది గత కుంభమేళా కంటే 4.5 రెట్లు ఎక్కువ. 1,896 రైళ్లు స్వల్ప దూరాలకు, 706 రైళ్లు దూర ప్రాంతాలకు, 559 రింగ్ ట్రైన్స్ నడపనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    ఉత్తర్‌ప్రదేశ్

    UttarPradesh: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం భారతదేశం
    Urine In Fruit Juice: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం ఇండియా
    Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి ఇండియా
    Wolf Attacks: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025