LOADING...
Punjab: పాక్‌ ఐఎస్‌ఐతో గూఢచర్యం.. 15 ఏళ్ల బాలుడు అరెస్ట్‌ 
పాక్‌ ఐఎస్‌ఐతో గూఢచర్యం.. 15 ఏళ్ల బాలుడు అరెస్ట్

Punjab: పాక్‌ ఐఎస్‌ఐతో గూఢచర్యం.. 15 ఏళ్ల బాలుడు అరెస్ట్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై భారత అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉగ్ర ముఠాలతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి, వారికి మద్దతు ఇచ్చినవారిని అరెస్ట్ చేయడం, దాడులకు పాల్పడే నెట్‌వర్క్‌ను నాశనం చేయడం లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజా ఘటనలో పాకిస్తాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్న 15 ఏళ్ల బాలుడిని పఠాన్‌కోట్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బాలుడు జమ్మూ జిల్లా సాంబా ప్రాంతానికి చెందినవాడిగా, దాదాపు ఏడాది పాటు ఐఎస్‌ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉండి భారత సైనిక స్థావరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని వారికి లీక్‌ చేస్తున్నట్లు గుర్తించారు.

Details

ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడి

అరెస్ట్‌తో పాటు, పంజాబ్‌కు చెందిన పలువురు మైనర్లకు కూడా ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లకు తక్షణమే సమాచారం పంపి, ఇతర బాలురను గుర్తించేందుకు చర్యలు ప్రారంభించబడ్డాయి. పంజాబ్‌లోని మైనర్ల ఆన్‌లైన్ కార్యకలాపాలు, కదలికలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోందని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ప్రకారం, దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఐఎస్‌ఐ ఏజెంట్లు పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను నడుపుతున్నారని కూడా గుర్తించారు. ఈ క్రమంలో, భారత యువతను లక్ష్యంగా చేసుకుని, దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు.

Advertisement