NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం
    మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం

    Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 13, 2025
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన 'మహా కుంభమేళా'కు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు ఉదయం కేవలం 60 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

    45 రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    మహాకుంభమేళా వల్ల వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో పెరుగుతాయన్నారు. ఒక్కో వ్యక్తి సగటున రూ.5 వేలు ఖర్చు చేసినా మొత్తం రూ.2 లక్షల కోట్లు అవుతుంది.

    Details

    రవాణా సేవల ద్వారా రూ.10వేల కోట్ల ఆదాయం

    హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక నివాసాలు, ఆహారం, వస్తువులు, ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు ఈ ఖర్చులో ఉంటాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖాండేవాల్ తెలిపారు.

    స్థానిక హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలి లాడ్జీల ద్వారా రూ.40 వేల కోట్ల ఆదాయం సాదించాలనుకుంటున్నారు.

    ప్యాకేజీ ఆహారం, నీరు, బిస్కెట్లు, జ్యూస్‌లు, భోజనం వంటి సరఫరాలతో రూ.20 వేల కోట్ల వ్యాపారం జరగనుంది.

    నూనె, దీపాలు, గంగా నీరు, దేవతా విగ్రహాలు, ధూపం వంటి పూజాసామగ్రి, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో రూ.20 వేల కోట్లు లావాదేవీలు జరగవచ్చును.

    ప్రయాణికుల కోసం టాక్సీలు, సరకు రవాణా వంటి సేవల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం రానుంది

    Details

    40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం

    టూరిస్ట్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీల ద్వారా రూ.10 వేల కోట్లు, మెడికల్ క్యాంపులు, ఆయుర్వేద ఉత్పత్తులతో రూ.3 వేల కోట్లు, టికెటింగ్, డిజిటల్ పేమెంట్లు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో రూ.1 వేల కోట్లు, మీడియాలో ప్రకటనలు, ప్రమోషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల వ్యాపారం జరగనుంది.

    2019లో జరిగిన ఆర్ధిక కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.1.2 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిసింది.

    ఈసారి ఒక నెల పాటు సాగే మహాకుంభమేళాకు సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

    దీంతో యూపీకి భారీ స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    ఇండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి ఇండియా
    Wolf Attacks: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి ఇండియా
    Uttarpradesh: రోగి నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు.. ఉద్యోగి సస్పెండ్  భారతదేశం
    Uttar Pradesh: ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. యూపీలో ప్రధాన సూత్రధారి ఎన్‌కౌంటర్‌ భారతదేశం

    ఇండియా

    111 medicines fail: నాణ్యత లోపంతో 111 ఔషధాల గుర్తింపు.. సీడీఎస్‌సీఓ నివేదిక ప్రపంచం
    Koneru Hampi: వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌గా కోనేరు హంపి స్పోర్ట్స్
    Bhatti Vikramarka: ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాపై కీలక చర్చలు తెలంగాణ
    Kerala: గంజాయి కేసులో కేరళ ఎమ్మెల్యే కొడుకు అరెస్టు.. సీపీఎం నేత ప్రతిభ వివరణ  కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025