NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్లో 2BHK ఇళ్ల పంపకానికి రంగం సిద్ధం.. దశల వారీగా 75 వేళ ఇళ్ల పంపిణీ
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్లో 2BHK ఇళ్ల పంపకానికి రంగం సిద్ధం.. దశల వారీగా 75 వేళ ఇళ్ల పంపిణీ
    దశల వారీగా పంపకం

    హైదరాబాద్లో 2BHK ఇళ్ల పంపకానికి రంగం సిద్ధం.. దశల వారీగా 75 వేళ ఇళ్ల పంపిణీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 16, 2023
    04:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రేటర్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం(2BHK) ఇళ్లను పంపిణీ చేసేందుకు ముహుర్తానికి రంగం సిద్ధం అవుతోంది.

    ఈ మేరకు వచ్చే వారం నుంచే ఆయా లబ్దిదారులకు రెండు పడక గదులను అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తొలివిడతలో భాగంగా సుమారు 75 వేలకుపైగా డబుల్ బెడ్రూంలను పంపిణీ చేస్తామన్నారు.

    హైదరాబాద్ పరిధిలో ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీతో సహా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు.

    జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సైతం ఈ భేటీకి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇళ్ల పంపిణీపై చర్చించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

    details

    రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం : మంత్రి కేటీఆర్

    ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక పక్రియ పూర్తి కావొచ్చిందని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వెరిఫికేషన్ ప్రాసెస్ ను మరింత వేగంగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇప్పటికే 70 వేల నివాసాలు నిర్మించామన్నారు.

    చివరి దశలో ఉన్న మరో ఐదు వేల ఇళ్లను నిర్మించి వచ్చే వారం నుంచే పంపిణీి చేస్తామన్నారు. మరోవైపు గ్రేటర్ లో ఇప్పటికే 4,500ల ఇళ్లను లబ్దిదారులకు అందించామన్నారు.

    లబ్ధిదారుల గుర్తింపులో గానీ ఎంపికలో గానీ రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులను గుర్తించారన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    తెలంగాణ

    Hyderabad: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం; హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..!   హైదరాబాద్
    Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం భారీ వర్షాలు
    నేటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన కేంద్ర ప్రభుత్వం
    మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు షహమత్ ఝా బహదూర్ కన్నుమూత హైదరాబాద్

    ప్రభుత్వం

    'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం భగవంత్ మాన్
    భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. 300 మంది పర్యాటకులను రక్షించిన అధికారులు సిక్కిం
    సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు, మద్యం పంచుకుండా గెలిపించాలని సూచన సిరిసిల్ల
    ముడుమాల్‌ మెన్హిర్స్‌ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం పర్యాటకం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025